Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

గింతఘోరం జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఎవడికి పట్టదు...!

   ఈ దేశంలో ఇప్పటికి కులం పునాదులు చాలా బలంగానే పాలకులు రూపొందిస్తున్నారు. కాకపోతే ఊల్లల్లో దిష్టిబొమ్మల్లా ఉండే గుడిసెలు ఇందిరమ్మ మంచి మనస్సుతో పెంకుటిల్లుగా మారిపోయినవి. ఇంకా కొన్ని గ్రామాల్లో గుడిసెలె ఆధారంగా ఉన్న పల్లెలు కోకొల్లలు.
   ఇప్పటికి కుక్కిన మంచంపై కూర్చునే హక్కు లేని స్వాతంత్ర్య దేశంలో బ్రతుకులు ఈడిస్తున్న వీరికి బడ్జెట్ అంటే ఏమిటో తెల్వదు, తెలిసిన చేసేదేమి లేదు.
   ఎందుకంటే రాజ్యాంగం ఎస్సీ, ఎస్టి లకు కల్పించిన నిధులు ఏమౌతున్నాయో ఎవరాడగలి...? ఎస్సీ, ఎస్టి వర్గాల నుండి చట్టసభలకు, స్థానికసంస్థలకు ఎంపికైన వారికే తెలిసినట్టు లేదు.
   పోనీ అధికారులు ఎమన్నా పట్టించుకుంటారా అంటే అదికూడా మృగ్యమే....!
   రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ప్రకారం చదువుకున్న వారికి ఉద్యోగం మన్నా ఇవ్వాలి, లేకపోతే స్వయం ఉపాధి అన్నా కల్పించాల్సిన ప్రభుత్వాలు దేశంలోని యువతకు మద్యం అందుబాటులోకి తెచ్చి తాగుబోతులుగా తయారు చేసి వారిని పార్టీ కార్యకర్తలుగా వాడుకొంటుంన్నాయి.
   మరి ఎలా...?
   వీరి జీవితాల్లో మార్పు వచ్చేది ఎప్పుడు...? మార్పు ఎలా వస్తది...!
   నిన్నగాక మొన్న మాదిగ విద్యావంతులు నిజామాబాద్ ప్రాతంలో డప్పు కోట్టలేదని గ్రామ బహిష్కరణ చేసారని పత్రికల్లో వార్తలు చూసిన సమాజం మౌనంగానే ఉన్నది కానీ అది తప్పు అని ఏ నాయకుడు ప్రశ్నించలేదు....?
   ఎందుకు.....?
   గింతఘోరం జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఎవడికి పట్టదు...!
   ఎటుపోతుంది, మనకు రాజ్యాంగం ఇచ్చిన చైతన్యం...! పండుగైన, పబ్బమైన, సావుకైనా, డప్పులు కొట్టాలని శాశించే ఈ సమాజం, మిగితా కులాల పట్ల ఎందుకు అలా ప్రవర్తించదు. డప్పు కొట్టేటోడు మాదిగ యినప్పుడ, చెప్పులు చేస్తున్న వారిని ఏమనాలి.....!(బాట,వుడ్ లాండ్,ఇంకా etc) కుమ్మరి వారి కుండ తీసుకెళ్లిన వారి కులం మారిందా...?
   ఇప్పుడు కుమ్మరులే తయారు చేస్తున్నారా బిందెలను, కుండలను, బీసీ కులాల వృత్తులను తీసుకెళ్లి జీవిస్తున్న అగ్రవర్ణా కులాలు దర్జాగా జీవిస్తుంటే కులవృత్తులు కోల్పోయిన బీసీ సమాజం ఉపాధి లేక దాంతో తిండిలేక, అగమ్యగోచరంగా తయారైన పరిస్థితి నేడు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది.
   మరి ఈ పరిస్థులకు కారకులు ఎవరు....?
   ఎవరాలోచించాలి...!
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎవరి వాటా ఎంతో రాజ్యాంగం ప్రకారం అందాల్సి ఉండగా నేటికి దోపిడి జరుగుతున్నా ఎవరికి పట్టింపు లేదు...? మరెట్లా...?
   దేశంలో మెజార్టీ ప్రజలు బీసీలే....!
   వీళ్లకి నిజంగా చలనం లేని బ్రతుకుకు అలవాటు పడి కుక్కిన పెనులా ఎందుకు జీవిస్తున్నారు....!
   మోసపోవడం అంటే ఒక్కసారి, రెండు సార్లు మోసపోతే ఎదో తెలువక మోసం జరిగింది అనుకుంటాం. కానీ 78 ఏళ్లుగా బీసీలకు రిజర్వేషన్లలలో మోసం జరుగుతూనే ఉంది.
   బీసీ పిల్లలకు జాతీయ స్థాయిలో రిజర్వేషన్లు లేక ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో అనుభవించిన వారికే తెలుస్తుంది.
   ఈ దేశంలో ఇన్ని అనార్దలకు ప్రధాన కారణం బీసీలకు రాజకీయ అధికారం లేకపోవడమే ప్రధాన సమస్య అని మాన్యవార్ కాన్షిరాం తేల్చిచెప్పారు. అందుకు అనుగుణంగా ఆయన పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేసి బీసీలకు రాష్ట్రాల పరిధిలో 48 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఈ విషయం బీసీలకు తెలియదు. పైగా ఆయన స్థాపించిన పార్టీ అంటరాని వాళ్ళ పార్టీగా బీసీ సమాజం చూస్తది. ఎవరు మార్చాలి వీళ్ళను....?
   బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే భరించలేని బీజేపీ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్న విపి సింగ్ ప్రభుత్వాన్ని కులగొట్టింది. ఐన ఆపార్టీ అంటేనే మాకు మక్కువ అనే భ్రమలో బీసీలు ఇంకా అపార్టీని బుజాలమీద మోస్తున్నారు...! ఎవరు మార్చాలి వీళ్ళని ఎప్పుడు మారతారు....?
   గింత ఘోరమా...?
   ఈ దేశంలో కుక్కలు, గాడిదలు, పశువులు, సరీసృపాలు, పక్షులు, జంతువులకు లెక్కలున్నాయి. కానీ దేశంలో 58 శాతం ఉన్న బీసీలకు లెక్కలు లేవు.
   దేశంలో బీసీల పేరిట అనేక సంస్థలు పనిచేస్తున్నాయి, బీసీ గణన చేయాలని ఎందుకు ఆందోళన చేయరు.
   బీసీల కోసం 1977 లో బి.పి మండల్ కమిషన్ ఏర్పాటు జరిగింది ఆ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి అనేక ప్రతిపాదనలు చేసింది. అది అమలు ఎందుకు కాలేదని ఒక్క బీసీ సోదరుడు ప్రశ్నించడు...? మరి బీసీల కోసం ఎవరు పోరాడాలి...!
   బీసీల రిజర్వేషన్లు కోసం బాబాసాహెబ్ అంబెడ్కర్ 340 ఆర్థికల్ ను రాసాడు దాన్ని పాలకులు అమలు పర్చడం లేదు ఈ విషయాలను బీసీ ప్రజాప్రతినిధులే పట్టించుకోరు....! మరెట్లా ...? బీసీలు బాగుపడేది....?
   కాబట్టి బీసీ సోదరులారా....! ఆలోచన చేసి మీ హక్కుల సాధనకోసం రాజకీయ సమీకరణాలు చేసి రాజ్యాంగం కల్పించిన హక్కులు పొందండి. లేక పోతే రానున్న బీసీ సమాజం మిమ్మలి క్షమించదు.....!
******************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.

Comments

Post a Comment