Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

కొన్ని వేల పేజీలున్న పుస్తకాన్ని ఒక్క నిమిషంలో పాట ప్రజల ముందు ఆవిష్కరిస్తుంది...!

      పాట అంటే ఉత్పేరకం....! ఆది మానవలోకాన్ని ఆలోచింపచేస్తుంది...
   పాట జీవకోటి హృదయాలను కదిలిస్తుంది...! కన్నీళ్ళు పెట్టిస్తుంది...!
   పాట హృదయంతరాల్లో దాగివున్న అనేక ఘన, ద్రవ పదార్థాలను ద్రవింప చేస్తుంది ..!
   పాట,అనేక కోణాల్లో అవిష్కారించబడి సమస్యని సమాజం ముందు పెట్టి ప్రశ్నిస్తుంది...! నిరసనను తెలియజేస్తుంది...!
   కొన్ని వేల పేజీలున్న పుస్తకాన్ని ఒక్క నిమిషంలో పాట ప్రజల ముందు ఆవిష్కరిస్తుంది...!
   మరి ఆపాట ప్రస్తుతం ప్రమాదంలో పడ్డది...!
   ప్రజలకు పాట దూరమైందని అనిపిస్తుంది...!అనుకుడుదేంది నిజమే కదా...?
   తెలంగాణ పాటగాళ్ళు ఒకప్పుడు రాగం తీసి పాడితే సభ దద్దరిల్లేది ముసలవ్వ శోకం పెట్టేది...!శ్రోతలంత గాభీరత్వంతో ఊగిపోయేవారు...! వారు ఇప్పుడు పల్లెల్లో కనపడుతలేరు...!
   పల్లెను,పాటను మింగిందేవ్వడో ....?
   ప్రజల జీవనం ఆర్టిఫిసీయల్ ఐపోయింది...! పూసిన పువ్వులతో పేర్చి ఆడే బతుకమ్మ, ప్లాస్టిక్ పువ్వులతో ఆడే బతుకమ్మె నిజమైన బతుకమ్మని నేటి యువత అనుకునే కాడికి బంగారు తెలంగాణ రాష్ట్రం వచ్చింది....!
   స్పందించే హృదయాలు పాటగాళ్లకు కరువైనవి...!
   పకృతి లోని గొప్పతనాన్ని ఒంటబట్టించుకొని గల గల పారే సెలయేరు లాగా పాటను అల్లే నైపుణ్యం కలిగిన కళాకారులు ఒల్లును కాపాడుకోవాలే....!
   రాజ్యం ఎప్పుడైనా రాతాగాడిని, పాటగాడిని నాశనం చేసే పనిలోనే ఆనందాన్నివెతుక్కొంటున్నాయి..!
   యవ్వనంలో అమ్మాయికున్న విలువు ఎదిగిన తర్వాత ఎలా ఉండదో... పాటగాడి జీవితం కుడా ఆలాగే...!
   ఆత్మగౌరవ పోరాటం ఒకవైపు అస్థిత్వం కోసం మరోవైపు ప్రయాణం చేసిన గొప్ప కళాకారుడు సాయిచంద్ రాజ్యం ఒత్తిడికి గురై తన ప్రాణాన్నే అర్పించుకోవాల్సి వచ్చింది....!
   ఎలాంటి రాజకీయ వారసత్వం లేని కొంతమంది తెలంగాణ ఉద్యమ కారులకు ప్రభుత్వంలో కొంత మేరకు అవకాశాలు దొరికాయి. దాంతో పని ఒత్తిడి, ఆర్దిక ఒత్తిళ్లు, అధినేతను ఒప్పించడం కోసం వారు నిరంతరం శ్రేమించడం వల్ల గుండె జబ్బులు వారి చుట్టూ చేరడం తో హఠాత్తుగా కుప్పకూలి పోతున్నారు...
   ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ మరణించిన పది రోజులకే గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ హాట్ హెటాక్ కుప్పకూలి పోవడం జరిగింది..!
   ఉద్యమం మొదలుకొని తెలంగాణ అస్తిత్వం కాపాడటం కోసం ఎంతో కృషి చేసి, చివరి వరకు కేసీఆర్ తో నడిచిన బహుజన ,శ్రామిక కులాల నేతలు మరణిస్తే వారికి అధికార లాంఛనంగా అంత్యక్రియలు జరుపక పోవడం విచారకరం...!
   సినిమా హీరోలు,నిజాం నవాబు వారసులు మరణిస్తే మాత్రం వారికి ప్రభుత్వం దగ్గరుండి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేసిన సందర్భాలు ఎన్నో.ఎన్నోన్నో...!
   మరి తెలంగాణ కోసం కొట్లాడిన ఈ నేతలకు అధికార దర్భనం ఎందుకందదో....! ఆలోచన చెయ్యాల్సిన అవసరం ఉందా...!లేదా...!
   ఇప్పటికైనా కలామతల్లి బిడ్డలైన కళాకారులారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
   లేకపోతే కుటుంబం రోడ్డున పడటం ఖాయం.....!
******************************
బండి మొగిలి,
న్యాయవాది,
వరంగల్,
9989602566.
 

Comments

  1. Let's try to revive the villages. I call it renaissance of the villages. Unless we replace the govt with good people dreamed Telangana is not possible.

    ReplyDelete
  2. చాలా బాగుందన్నా...
    పాట నిజంగానే ప్రమాదంలో ఉంది.

    ReplyDelete

Post a Comment