Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

అదానీ గ్రూప్ చేస్తున్న వ్యాపారం వల్ల దేశంలోని పేదలకు ఏమైనా ఉపయోగం ఉందా ..!

 

నవ తరంగాలు

ప్రపంచంలోనే దేశాన్ని టాప్ లోకి తేవడం కోసం కృషిని గంగలో, తుంగలో తొక్కిన పాలకులు....!

  దోపిడీలో మాత్రం టాప్ 3లో చోటు సంపాదించిన ఆదానీ నీ మాత్రం మన పాలకులు కొనియాడుతున్నారు...! 

   

  ఒక్క ఏడాదికలోనే నాలుగు లక్షల కోట్లు సంపాదించాడాంటే ఈయన పని వ్యాపారమా...? లేక దొంగ తనమా.....?

 దేశ ప్రజలు ఆలోచన చేయాలి...!

 అదానీ గ్రూప్ చేస్తున్న వ్యాపారం వల్ల దేశంలోని పేదలకు ఏమైనా ఉపయోగం ఉందా ..!

 లేదు కదా...!

  అలాంటప్పుడు పేదప్రజల రక్తాన్ని చేమటగా చేసి ప్రభుత్వానికి కట్టిన పన్నుల నుండి ఆధానీ, అంబానీ,  తదితర వ్యాపారవేత్తలకు సబ్సిడీలు, పన్ను రాయితీలు ప్రభుత్వాలు ఎందుకిస్తున్నట్లు ప్రజలు ఆలోచన చేయాలి...! 

వీరి వ్యాపారాల వల్ల పాలకులకు ఖరీదైన ఇండ్లు, కార్లు, భూములు, ఇంకా ఎన్నో లక్షల కోట్లు రూపాయలు సమకూరుస్తున్నయి.

   ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ఇన్ని కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమిచేస్తున్నరో ఓటర్లకు తెలియదా...?

 మరి ఎందుకు ఈపార్టీలనే అధికారంలో కి తెస్తున్నారు, పైగా ఓటరు మాకేమన్న ఉత్తగా ఓట్లు వేస్తున్నారా...? మేము ఓటుకు వెయ్యి, ఐదొందలు బీరు, బిర్యానీలు ఇచ్చి ఓట్లను కొంటున్నాము అంటున్నారు...! 

  పైగా ఓటరే మారాలి అప్పటి వరకు ఈ సిస్టం మారదంటున్నరు...!

   మరి ఏమిచేద్దాము...?

 మారుదమా...?

 లేక బీరు బిర్యానీ డబ్బులకు అమ్ముడు పోదామా...? 

  వారైతే ఎలాగూ మారరు...! 

ఎందుకంటే అధికారాన్ని అనుభవిస్తున్న  పార్టీల రక్తంలోనే  మోసం చేసే డి, ఎన్, ఏ, ఉంది...! 

కాబట్టి మారాల్సింది మనమే...! 

   బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసింది, ఓటు హక్కు ఇచ్చింది...! మెజార్టీ ప్రజలు అధికారంలోకి రావాలని...! మైనార్టీ ప్రజలను కాదు..?

  ఓటును అమ్మకు పౌరుడా...? 

  సోయి తెచ్చుకొని ఈ దేశాన్ని కాపాడే బాధ్యతను తీసుకో.....!

************************************************************

                                                 బండి మొగిలి,

                                                   న్యాయవాది,

                                                 9989602566.



Comments

Post a Comment