Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 74 సంవత్సరాలు ముగిసింది....!

 దేశానికి స్వాతంత్య్రం వచ్చి 74 సంవత్సరాలు ముగిసింది....!

******************************

 75 వ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం.....!

""""""""""""""""""""""""""""""""""""""""""""""

      అంటరానితనంతో వారి జీవితాల్లో మార్పు రాకపోవడానికి కారణం ఎవరు...?

 74 సంవత్సరాల తర్వాత కూడా దళిత బహుజనుల పై ఎందుకు హత్యలు, అత్యాచారాలు,ఎందుకు కొనసాగుతున్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఒక్కసారి మేధోమదనం చేసుకోవాలి....!

   74 సంవత్సరాల స్వాతంత్ర్యం తర్వాత కూడా ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు భూమి ఎందుకు లేదు...?

    అణగారిన వర్గాలను పనిగట్టుకొని ఇంకా ఎన్ని సంవత్సరాలు అభివృద్ధికి దూరం చేస్తారు...!అభివృద్ధికి నోచుకోని పథకాలకు రచనలు చేస్తూ అణగారిన వర్గాలను పాలనకు ఇంకా ఎంతకాలం దూరం చేస్తారు...!

 దళిత బహుజనులు ఇంకా ఎన్ని సంవత్సరాలు భరించాలో  మననం చేసుకోవాల్సిన అవసరం ఉందా...? లేదా...? ఆలోచన చేయండి....!

     74 సంవత్సరాల తర్వాత కూడా ప్రతి విషయంలో అభద్రతా భావం, అమ్మాయిలపై అఘాయిత్యాలు, అన్యాయంపై ప్రశ్నిస్తే హత్య చేయడం ఇంకా ఎన్నాళ్లు....!

    74 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా కుల అసమానతలు, ప్రేమిస్తే చంపి వేయడం, ఓట్లను డబ్బులకు కొని అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత సమాజ ఉత్పత్తిని దోపిడీ చేసి ప్రజలకు కనీస అవసరాలు కల్పించకుండా మోసం చేస్తున్న పాలకులను ప్రశ్నించాలి....!

    ప్రభుత్వ సంస్థలు, వైద్యశాలలను ప్రైవేట్ పరం చేసి, ప్రకృతి విరుద్ధంగా జరిగే అనేక సంఘటనలు సామాన్య ప్రజలు ఇంకా ఎంత కాలం అనుభవించాలో మెజార్టీ కులాల ఓటర్లు ఆలోచన చేయాలి...??

 లేక...?

     ఇంకో వంద సంవత్సరాలు బానిసత్వాన్ని  అనుభవిస్తారా..! తేల్చుకోండి...!

                                              జైభీంలతో,

                                          బండి మొగిలి,

                                            న్యాయవాది,

                                         9989602566.



Comments