Skip to main content

త్వరలో కొత్త వార్తలను మీరు ఇక్కడ చూడవచ్చు

జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?

న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…: “ జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి? " బండి మొగిలి, న్యాయవాది,    వరంగల్, ఆగస్టు 16 (నవ తరంగాలు) : న్యాయవ్యవస్థకు నిప్పుపెట్టిన నగదు కట్టలు…    జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం లేవనెత్తుతున్న ప్రశ్నలేమిటి?    న్యాయం చెప్పాల్సిన వ్యక్తి ఇంట్లోనే భారీగా కాలిపోయిన కరెన్సీ కట్టలు కనిపించాయనే ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదు.    అది కూడా ఒక హైకోర్టు న్యాయమూర్తి అధికారిక నివాసంలో, అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం అనంతరం స్టోర్‌రూమ్‌లో భారీ మొత్తంలో నగదు కనిపించిందనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.    ఈ వ్యవహారం కేవలం ఒక న్యాయమూర్తికి సంబంధించిన వ్యక్తిగత వివాదంగా చూడాల్సిన అంశం కాదు. ఇది న్యాయవ్యవస్థ పారదర్శకత, న్యాయమూర్తుల జవాబుదారీతనం, అవినీతి నిరోధక వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం వంటి అనేక కీలక ప్రశ్నలను ముందుకు తెచ్చింది.    2025 మార్చి 14 రాత్రి ఢిల్లీలో అప్పటి ఢిల్లీ హైకోర్టు న...

ఇది నిజం....!








 ఇది నిజం....!

    కానీ ఆయన  బీసీ నేత ఐనప్పటికి  ఒక అగ్రవర్ణ, పెట్టుబడి దారుడిలానే ఆలోచిస్తాడన్న...!    ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా టీఆర్ఎస్ లొనే ఉందామని అనుకున్నా.... ఈటెలకు కేసీఆర్ రూపంలో ప్రమాదం  రానే వచ్చింది...! అప్పుడు ఈటెల నేను బీసీనేతను, పిల్లి పులితోలు కప్పుకొన్నట్లు వ్యవరిస్తున్నారు ఈటెల...! ఇప్పటికి ఈటెల కేసీఆర్ పైన గాని కేసీఆర్ మానసపుత్రుడు కేటీఆర్ పైన గాని ఘాటు వ్యాఖ్యలు చేయడం లేదు అన్ని పార్టీలు బీసీలకోసం ఏమిచేసాయి..? ఒక్కసారి ఆలోచించండి డబ్బు, పేరు, పలుకుబడి, కులబలం,సామాజిక నేపద్యం ఉంటే గాని జనరల్ స్థానాల్లో టికెట్ ఇచ్చారు. మెజార్టీ ప్రజలుంటారు వారు చదువుకోని ఉద్యగాలు,వ్యాపారాలు, కాంటాక్టు లు చేసి బోలెడు డబ్బు సంపాదిస్తారు కానీ 3% ఉన్న అగ్రవర్ణ పార్టీలకు ఉచిపోసుకొంటారు...! ఇక్కడ బాలహీనులేవరు...? 

అంబెడ్కర్ ఇచ్చిన ఓటు హక్కును ఒక్కసారి అమ్ముకోకుండా నిజాయితీ కల్గిన వ్యక్తుల కు వేసి గెలిపించడానికి గత 75 సంవత్సరాల నుండి కనీసం ప్రయత్నం చేయరు..!

    B S P  మెజార్టీ బీసీలకు టికెట్లు ఇస్తే కులం తక్కువొళ్ళు పార్టీ అని వాళ్లకు ఓట్లు వేయరు పైగా ఆత్మగౌరం అని అగ్రవర్ణాల పంచన చేరి భజన చేస్తారు...! ఆ పార్టీవోడు ఎల్లగొడితే  ఇంకో అగ్రవర్ణపార్టీకి వెల్లడమే కానీ నాజాతి ఎన్ని సంవత్సరాల నుండి రాజాకీయ, రిజర్వేషన్లు కు దూరంగా నెత్తివేయబడిందని ఆలోచన చేసే నేత బీసీలకు కరువైనాడు. ఇక ఈటెల కు అన్యాయం జరిగిందని ఉద్యమం చేసి తెచుకొన్న తెలంగాణలో ఎంతో మంది బీసీలు,ఎస్సీ లు,ఎస్టీ లు ఆత్మబలిదానాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొంటే దానికి బీసీలు, ఎస్సీ లు,ఎస్టీ లంతా కలిసి బంగారు తెలంగాణ కేసీఆర్ తోనే సాధ్యమని మీరే గొంతు చించుకొని ముఖ్యమంత్రి ని చేస్తిరి మీకున్న ప్రేమ ఆయనకు మీమీద ఉన్నదా...? లేదు పైగా నేను బీసీ బిడ్డనే అని గంగుల కమలాకర్  తొడకొట్టుతున్న సన్నివేశాలు చూస్తూనే ఉన్నాము వాడేళ్లగొడితే వీడి దగ్గరికి, వీడేళ్లగొడితే వాడి దగ్గరికి బీసీలు వెళ్లడం బందై  తెలంగాణలో ఒక స్వతంత్ర పార్టీ బీసీలు పెట్టుకొని ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ ప్రజలను కలుపుకొని  ప్రజాక్షత్రం లోకి వెళ్లి నిజాయితీగా పని చేయండి, ప్రజలు మీవెంటే వుంటారు కానీ ఆస్తులు, భూములు, రాజకీయ అస్తిత్వం కాపాడుకోవడం కోసం నేను బీసీ నంటే....!

    కుదరదు ఎవ్వరు నమ్మరు...!

కాబట్టి ఈటెల కోసం కష్టపడే నా రక్తబందువులారా...! 

   ఓటు హక్కు ఆయుధంగా చేసుకొని అగ్రవర్ణ పార్టీలను ఓడించడం కోసం కార్యాచరణ సిద్ధం చేయండి...! ఈటెల స్వాతంత్య్రగా ఎన్నికల బరిలో ఉన్నా, కొత్తపార్టీ పెట్టినా..! స్వాగతిస్తాం...! లేని పక్షంలో మనకున్న జెండా అజెండా...మన ప్రజలను జాగృతం చేయడమే లక్ష్యంగా పని చేద్దాం...! తప్పకుండా భారతరాజ్యాంగం మనల్లి కాపాడుకొంటది....!

                              జైభీంలతో..,

                         మీ బండిమొగిలి,             

                           న్యాయవాది,

                       9989602566

Comments

Post a Comment